telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిక్కింలో చిరు, మోహన్‌ బాబు..ఫోటోలు వైరల్ !

టాలీవుడ్‌ పరిశ్రమలో మెగాస్టార్‌ చిరు, మోహన్‌ బాబు పెద్ద స్టార్లు. వీళ్ల మధ్య మొదట్లో గొడవలు అయ్యాయి. తర్వాత కలిసిపోయారు.  ఇది ఇలా ఉండగా..  మోహన్ బాబు, చిరంజీవి వీకెండ్ లో సిక్కిం వెళ్ళారట. ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మీనే బయటపెట్టింది. సోషల్ మీడియాలో చిరంజీవితో పాటు మోహన్ బాబు ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ, ఈ ట్రిప్ కు సంబంధించిన కొంత సమాచారాన్ని లీక్ చేసింది. ‘ఇద్దరు మాస్ట్రోస్ సిక్కిం కు క్విక్ ట్రిప్ కు వెళ్ళడం విశేషం. చిరంజీవి అంకుల్ ఈ క్విక్ వీకెండ్ ట్రిప్ కు నాన్నను ఒప్పించడం గ్రేట్. నాకైతే చాలా అసూయగా ఉంది. అయితే మీ ఇద్దరూ ఇలా ఒక చోట చక్కటి సమయాన్ని గడపడంతో మనసు నిండిపోయింది. ఏదో ఒకరోజు పిల్లలం కూడా మీతో కలుస్తాం” అంటూ మంచు లక్ష్మీ మనసులోని మాటను కూడా బయట పెట్టేసింది. ఇంతకూ ఈ ‘బిల్లా-రంగా’ సిక్కింకు సరదాగా వెళ్ళారా? లేదా వేరే ఏదైనా పనిమీద వెళ్ళారా అనేది తెలియాల్సి ఉంది!

Related posts