జీ తెలుగు ఛానెల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో బాలయ్య స్పూఫ్లు చేస్తూ జూనియర్ బాలకృష్ణగా గుర్తింపు తెచ్చుకున్న కందుకూరి గోకుల్ సాయికృష్ణ మరణించాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న గోకుల్ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గోకుల్ మరణవార్త అతని కుటుంబ సభ్యులతో పాటు బాలకృష్ణ అభిమానులను షాక్కు గురిచేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలనటుడు ఇలా అకస్మాత్తుగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం అందరినీ కలచి వేసింది. కాగా, తన అభిమాని మరణవార్త విన్న బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ మేరకు ఫేస్బుల్లో పోస్ట్ పెట్టారు. “మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ బాలకృష్ణ” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నాకొడుకు ‘దొంగ నా కొడుకు!’… రవితేజ ఆసక్తికర పోస్ట్…