telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంపీ అరవింద్ కి పిచ్చి కుక్క కరిచి పిచ్చి పట్టింది : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

aravind mp

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. దేశ నిఘా వ్యవస్థ వైఫల్యం చెందింది అంటూ మండిపడ్డారు. నిజామబాద్ ఎంపీ అరవింద్ కి పిచ్చి కుక్క కరిచి పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోధన్ లో రోహింగ్యాలు లేరు ఉన్నారని నిరూపిస్తే నిమిషంలో రాజీనామ చేస్తానని సవాల్‌ విసిరారు. ఇతర దేశాస్తులు భారత దేశంలోకి ప్రవేశిస్తున్నారు అంటే ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యమేనని ఫైర్‌ అయ్యారు. దేశంలో బిజెపి ప్రభుత్వ నిఘ వ్యవస్థ, భద్రత వ్యవస్థ విఫలమైందని.. అందుకే ఇతర దేశాస్థులు అక్రమంగా చొరబడి శాంతి భద్రతలకు విఘతం కల్గిస్తున్నారని మండిపడ్డారు. 32 మంది నకిలీ పాస్ పోర్టులు పొందారు అంటే రీజినల్ పాస్ పోర్ట్ అధికారి ఏమి పీకుతున్నాడని.. ఆ అధికారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. దమ్ముంటే నీ తండ్రి డి. శ్రీనివాస్… టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం నుండి పొందిన రాజ్య సభ స్థానానికి రాజీనామ చేయించాలన్నారు. నకిలీ పాస్ పోర్టులు మంజూరు చేసింది బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని మండిపడ్డారు.

Related posts