telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేష్ చేతుల మీదుగా రంగ్ దే పాట…

టాలీవుడ్ లో హీరో నితిన్ ప్రస్తుతం చకచకా సినిమాలు చేస్తున్నాడు. అయితే అదులో కీర్తీ సురేష్ తో జంటగా చేస్తున్న సినిమా రంగ్‌దే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను లాక్‌డౌన్ తరువాత కూడా ఎంతో ప్రణాళికా బద్దంగా పూర్తి చేశారు. ఈ సినిమా వెంకి దర్శకత్వం వహించాడు. దీనిని సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా నుండి ఈ మధ్యే “బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే ” అంటూ వచ్చిన పాట ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ సినిమా నుండి ఇప్పుడు మరో పాట రానుంది. ”నా కన్నులు ఎప్పుడు” అంటూ సాగనున్న ఈ పాట మార్చి 4 న సాయంత్రం 4:05 గంటలకు సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయనున్నాడు. ఇక ఈ సినిమా హోళీ సందర్బంగా మార్చి 26న అభిమానుల ముందుకు రానుంది. దాంతో చిత్రబృందం ఇప్పుడు ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయింది. అయితే అభిమానుల్లో ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఆ అంచులను అందుకుంటుందా… లేదా అనేది.

Related posts