telugu navyamedia
రాజకీయ వార్తలు

భారతావని ఎప్పుడూ తలఎత్తుకునే ఉంటుంది: మోదీ

PM Modi says India is great

భారతావని ఎప్పుడూ తలఎత్తుకునే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మెరుపు దాడుల వీరులకు నమస్కరిద్దాం అని అన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని ఇస్తున్నానని ఆయన అన్నారు. దేశానికిఎన్నటికీ తలవంపులు తీసుకురానని విజయయాత్ర కొనసాగుతుందని మోదీ వ్యాఖ్యానించారు.

దేశ రక్షణలో అమరులైన సైనికుల ఆత్మశాంతి కోసం నిన్న యుద్ధ ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ కన్నా దేశం గొప్పదన్న భావనతో పని చేస్తున్నామని అన్నారు. జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నానని తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అనేక మంది యువకులు దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారనీ ఇది మనందరికీ గర్వకారణమని అన్నారు. జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.

పుల్వామా దాడికి ప్రతీకారంగా మంగళవారం తెల్లవారు జామున భారత్ వాయు సేన జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 300కుపైగా ఉగ్రవాదులు మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఈ రోజు ప్రజల్లో ఓ కొత్త ఉత్సాహాన్ని నేను చూస్తున్నాను అని మోదీ  ఉద్వేగంతో అన్నారు.

Related posts