జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి నాయకుడు సాకే పవన్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఆదేశిస్తే కనుక ఇప్పుడే రంగంలోకి దిగుతానని, వైసీపీ నేతల తలలు నరుకుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ బనాయించే కేసులకు తమ కార్యకర్తలెవరూ భయపడే ప్రసక్తే లేదని అన్నాడు. అనంతపురం జిల్లాలో ప్రకాశ్ రెడ్డే కాదు ఏ రెడ్డి అయినా సరే, వారి తలలు నరికేందుకు ‘నేను రెడీ’..‘మీరు రెడీనా?’ అంటూ కార్యకర్తలను ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలతో సభా వేదికపై ఉన్న పవన్ కల్యాణ్ సహా నాదెండ్ల మనోహర్ తదితర నేతలు ఆశ్చర్యపోయారు.