telugu navyamedia
రాజకీయ వార్తలు

అసోం పౌర జాబితా విడుదల చేసిన భారత్.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న పాక్

imran pakistan pm

అసోంలో నివసిస్తున్న విదేశీయులను ఏరిపారేసేందుకు ఉద్దేశించిన పౌర జాబితాను భారత ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పౌర జాబితాపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కశ్మీర్ అంశాన్నిప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం జాతి నిర్మూలనే ధ్యేయంగా మోదీ సర్కారు వ్యవహరిస్తోందంటూ ఆరోపించారు.

భారత, అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమాద సంకేతాలుగా పరిగణించాలని ఆరోపించారు. , ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి కశ్మీర్ దురాక్రమణ అనేది ఓ విస్తృత విధానంలో భాగమని దుయ్యబాట్టారు. అసోం పౌర జాబితాలో లేని లక్షల మంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉందంటూ ఈ మేరకు ఓ మీడియా కథనాన్ని జతచేస్తూ ఇమ్రాన్ ట్వీట్ చేశారు.

Related posts