తెలుగు తేజం పీవీ సింధు ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ పోటీల్లో అనేక పతకాలు పొందిన ఆమె జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కించేందుకు సోనుసూద్ ముందుకు వచ్చారు. ఈ బయోపిక్ ను తాను నిర్మిస్తూనే, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రలో కూడా నటించనున్నారు. అయితే పీవీ సింధు పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతుండగా, అక్కినేని కోడలు సమంతని ఫైనల్ చేసారనే టాక్ నడుస్తుంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న సమంత అయితేనే పీవీ సింధు పాత్రకి సరిగ్గా సరిపోతుందని సోనూసూద్ భావించాడట. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది. మరోవైపు పీవీ సింధు కోచ్ గోపిచంద్ బయోపిక్ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుండగా ఈ చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్నాడు. పీవీ సింధు బయోపిక్ ను తెరపై వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.