telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏపీలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి

రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు హైవే పెట్రోలింగ్ పోలీసులపైకి దూసుకెళ్లింది లారీ. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మెండి సత్యనారాయణ, హోమ్ గార్డు ఎన్. ఎస్. రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుండి వస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వెహికిల్ కు ఎస్కార్ట్ గా వెళ్లేందుకు బ్రిడ్జి వద్ద ఇద్దరు హైవే పెట్రోలింగ్ పోలీసులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ పోలీసులపైకి దూసుకొచ్చింది లారీ. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు పోలీసులు మరణించారు. మృతి చెందిన పోలీసులు..కాకినాడ‌ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు.  

Related posts