ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో మరో ముగ్గురికి కరోనా సోకింది. అయితే గతంలో వాంఖడే స్టేడియంలో పని చేసే పది మంది సిబ్బందికి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. వాళ్లకిప్పుడు నెగెటివ్గా తేలిందని సమాచారం. అయినా తాజాగా మరో ముగ్గురు వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ముంబైలో యథాతథంగా మ్యాచ్లు నిర్వహిస్తామని బీసీసీఐ, మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించాయి. ముంబైలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలో సోమవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతంలో లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 2021లో పాల్గొనే ఆటగాళ్లకు మాత్రం రాత్రి 8 తర్వాత ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఐపీఎల్ 14వ సీజన్ మరో మూడు రోజులో ప్రారంభం కానుంది. ప్రధాన నగరాల్లో బయో బాబుల్ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నారు. చూడాలి మరి ఇప్పుడైనా బీసీసీఐ ముంబై లో మ్యాచ్ లు నిర్వహించడం పై పునరాలోచన… చేస్తుందా.. లేదా అనేది.
previous post
next post