telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా నుంచి ఆఫ్రిదీ త్వరగా కోలుకోవాలి: గౌతమ్ గంభీర్

Gautam Gambhir bjp

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈరోజు ఓ టీవీ షోలో గంభీర్ మాట్లాడుతూ… వైరస్ నుంచి ఆఫ్రిదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. కరోనా వైరస్ ఎవరికీ రాకూడదని అన్నాడు. ఆఫ్రిదీతో తనకున్నవి రాజకీయ పరమైన విభేదాలు మాత్రమేనని, వ్యక్తిగత వైరం కాదని చెప్పాడు.

భారత్ కు సాయం చేస్తామని పాక్ అంటోందని.. ముందు వారి దేశం గురించి వారు ఆలోచించుకోవాలని ఎద్దేవా చేశాడు. భారత్ కు సాయం చేయడానికి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమేనని అన్నాడుఅయితే, ముందు బోర్డర్ వద్ద ఉగ్రవాదాన్ని ఆపాలని అన్నాడు.

కశ్మీర్ అంశంపై ఆఫ్రిదీ, గంభీర్ ల మధ్య ఎప్పుడూ ట్విట్టర్ వార్ నడుస్తుంటుందనే సంగతి తెలిసిందే. భారత ప్రధానిపై కూడా ఇటీవల ఆఫ్రిదీ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ సందర్భంగా ఆఫ్రిదీ వంటి జోకర్లు భారత్ పై ఎప్పుడూ విషం కక్కుతూనే ఉంటారని గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు.

Related posts