telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోలీసు కాపలా పెట్టి మద్యం విక్రయాలు: భట్టి విక్రమార్క

Batti vikramarka

తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రారంభమైన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. పోలీసు కాపలా పెట్టి మరీ మద్యం విక్రయాలు సాగిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలు మరణిస్తున్నా మద్యం వల్ల వచ్చే ఆదాయమే ముఖ్యమా? అని ప్రశ్నించారు. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం షాపులు తెరిచి ఇన్నాళ్ల శ్రమ వృథా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? అంటూ భట్టి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దోపిడీని ప్రశ్నిస్తే ఇష్టంవచ్చినట్టు తిడుతున్నారని, విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.కొత్త విద్యుత్ చట్టం విధివిధానాలు వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త విద్యుత్ చట్టంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా నష్టమో చెప్పాలని అన్నారు. ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ సబ్సిడీలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

Related posts