telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను: ఎంపీ కోమటిరెడ్డి

komati-venkat-reddy mp

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆస్తులపై సీఎం కేసీఆర్ కన్ను పడిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ లో ఆర్టీసీ ఆస్తులను ఓ ఎంపీకి ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఆర్టీసీపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయనడం సరికాదు అని హితవు పలికారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, ఈ విషయంలో జగన్ ను చూసి కేసీఆర్ బుద్ధితెచ్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఏది మాట్లాడినా మోసమే అని, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను పడిందని, ఆర్టీసీ సమ్మెపై టీఎన్జీవో నేతల వ్యాఖ్యలు సరికాదని, కార్మికులు అధైర్యపడొద్దని, తెలంగాణ సమాజం వారి వెంట ఉందని ధైర్యం చెప్పారు.

Related posts