తమిళనాడు లో ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది.. తాజాగా, రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, సంస్థలు 24 గంటలు పనిచేసేలా త్వరలో చట్టం అమలుకు శ్రీకారం చుడుతోంది. దుకాణాలు, సంస్థలు పనిచేసే విధానాలను రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తుంది. ఈ నేపథ్యంలో, 2016లో కేంద్రప్రభుత్వం దుకాణాలు మరియు సంస్థలు (విధుల నియంత్రణా మండలి, సేవలకు సంబందించిన నిబంధనలు) చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ ప్రకారం సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా పలు పరిశ్రమలు వారం లో 7 రోజుల పాటు 24 గంటలు పనిచేయవచ్చు. ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అలాగే అమలుచేయకుండా, ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా మార్చుకొని అమలు చేస్తున్నాయి.
ఈ చట్టాన్ని మొట్టమొదటిసారిగా అమలుచేసిన రాష్ట్రంగా మహారాష్ట్ర పేరు గాంచింది. 2018 నుంచి ఆ రాష్ట్రంలో దుకాణాలు, పరిశ్రమలు 24 గంటలు పనిచేసేలా నిబంధనల్లో మార్పు చేశారు. అలాగే, రాష్ట్రంలో 2017 మార్చి 22వ తేది దుకాణాలు, పరిశ్రమలు 24 గంటలు పనిచేసేలా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వానికి కార్మికశాఖ కమిషనర్ రాసిన లేఖలో… మహిళల భద్రత సహా పలు నిబంధనలతో దుకాణాలు, పరిశ్ర మలు 24 గంటలు పనిచేసేలా అనుమ తులు ఇవ్వవచ్చని కమిషన్ లేఖలో ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
ఈ సిఫారసులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వ దీనిపై త్వరలో అధికారపూర్వక ప్రకటన విడుదల చేయనుంది. అందులో ముఖ్యంగా, వారంలో ఒకరోజు కార్మికులకు షిఫ్టు పద్ధతిలో సెలవు ఇవ్వాలి. ఏయే రోజు ఏ కార్మికుడు సెలవు అనే వివరాలతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలి. ఏ కార్మికుడైనా 8 గంటలకు అధికంగా అంటే వారంలో 48 గంటలు, ఓవర్ టైంను ఒక రోజుకు 10.30 గంటలు అంటే వారంలో 57 గంటలకు మించి విధులు నిర్వహింపజేయరాదు. సాధారణ రోజుల్లో రాత్రి 8 గంటలకు పైన మహిళలు పనిచేయాల్సిన అవసరం లేదు. రాతపూర్వకంగా వారు అంగీకారం తెలియజేస్తే రాత్రి 8 నుండి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు తగిన భద్రత కల్పించి విధులను అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
కూటమి పార్టీలన్నింటికి అవినీతి చరిత్ర: మోదీ