మేతేరా వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో ఒక్క వికెట్ తీసిన భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా రికార్డు నెలకపాల్పడు. అయితే ఆ ఒక వికెట్ తో జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించాడు. ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ (28)ను ఔట్ చేయడంతో ద్వారా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న 59 వికెట్ల రికార్డును వెనక్కి నెట్టాడు. అయితే చాహల్ ఈ ఘనతను కేవలం 46వ మ్యాచ్లోనే అందుకోవడం విశేషం. ఓవరాల్గా చాహల్కు ఇది భారత్ తరఫున 100వ అంతర్జాతీయ మ్యాచ్. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే ద్వారా చాహల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అప్పటినుండి 54 వన్డేల్లో ఈ 92 వికెట్లు , 46 టీ 20 మ్యాచ్లలో 60 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మొదటి మ్యాచ్ లో ఒదిన భారత జట్టు ఈరోజు జరగనున్న రెండో మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
previous post
జగన్తో కేసీఆర్ కొత్త బంధాలు: లక్ష్మణ్