బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలో కొనసాగుతోంది. 62 సీట్లలో బిజేపీ, శివసేన కూటమి తన సత్తా చాటుతోంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వెనుకంజలో ఉంది. ఫడ్నవీస్ నేతృత్వంలోని కూటమి తన హవా చాటుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగిన దిగ్గజ నేతలు ముందంజలో కొనసాగుతున్నారు.
బీజేపీకి చెందిన పంకజా ముండే… పర్లీ సీటులో తన సత్తా చాటుతున్నారు. భోకర్ నుంచి పోటీకి దిగిన అశోక్ చవాన్(కాంగ్రెస్) లీడ్లో కొనసాగుతున్నారు. అదేవిధంగా వర్లీ నుంచి పోటీ చేసిన ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు. శివసేన నుంచి పోటీకి దిగిన ఏకనాథ్ షిండే మొదటి రౌండ్ నుంచి తన హవా కొనసాగిస్తున్నారు.