ఆంధ్రప్రదేశ్ లో చాపకింద నీరులా కరోనా విస్తరించడంతో రోజురోజుకూ కోవిడ్-19 బాధితుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకూ ఏపీలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.
“రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో, కొత్త గా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణ జిల్లా లో 6, చిత్తూరు లో 3 కేసు లు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల తో రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 329 కి పెరిగింది” అని పేర్కొంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసిన స్టాలిన్