కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ప్రభావంతో దేశంలోని బడుగు, బలహీన వర్గాలు… రోజువారి కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని సాయం చేసేందుక ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించారు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మాత్రం సరికొత్త ప్రయోగంతో విరాళాలు సేకరించేందుకు సిద్ధమయ్యాడు. ఓ రెండు సేవాసంస్థలతో ఈ కార్యక్రమానికి పూనుకున్నాడు. ఇందులో భాగంగా గివ్ ఇండియా అనే సంస్థ ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 60 వేల మంది కార్మికులను గుర్తించింది. వారిని అందరం కలిసి ఆదుకుందామని హీరో అర్జున్ కపూర్ పిలుపునిచ్చాడు. tofankind.org వెబ్సైట్లోకి లాగిన్ అయి ఎవరైనా సరే తమకు తోచినంత డొనేషన్ ఇవ్వొచ్చని చెప్పాడు అర్జున్. ఇలా ఇచ్చిన వారిలో ఓ ఐదుగురు లక్కీ విన్నర్స్ను పిక్ చేసి, ఈనెల 11న వారితో వర్చువల్ డేటింగ్కు వెళతానని పేర్కొన్నాడు. ఆ సమయంలో వారు చెప్పినవి వింటూ, వారితో మాట్లాడుతూ, కలిసి లంచ్ చేస్తానని తెలిపాడు.
previous post
next post
పెళ్లిపై కన్నడ హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు