విశాఖ సాల్వెంట్స్ పరిశ్రమలో సోమవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సీనియర్ కెమిస్ట్ నాగేశ్వరరావు కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇటీవల ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇచ్చిన ప్యాకేజీనే సాల్వెంట్ ప్రమాద బాధితులకూ ఇవ్వాలని కోరారు. ప్రమాదానికి కారణమైన కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేయాలని అన్నారు. వారిని వదిలేసి పరామర్శకు వెళ్లిన నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జగన్ బాధ్యతారాహిత్యం వల్లనే విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు.