telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నాంపల్లి రైల్వేస్టేషన్లో కరోనా అనుమానితుడు

karona

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కొందరు జనం మధ్య తిరుగుతూ వైరస్‌ విస్తరణకు కారణమవుతున్నారు. చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ స్టాంపుతో ఉన్న ఓ కరోనా అనుమానితుడిని హైద్రాబాద్ నాంపల్లి స్టేషన్లో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన మోసిన్‌ అలీ.. నైజీరియా, లాగోస్‌ నుంచి అబుదాబీ మీదుగా విమానంలో ముంబైకి వచ్చాడు. ముంబై నుంచి ఓ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఈ ఉదయం నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. మరో ప్రయాణికుడు మోసిన్‌ చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ స్టాంపును చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రైల్వే పోలీసులు మోసిన్‌ అలీని అదుపులోకి తీసుకుని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Related posts