telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

నిజామాబాద్ వాసి భలే ఆఫర్‌ : గూగుల్‌ పేలో లక్ష

‘గూగుల్ పే’ ద్వారా లావాదేవిలు నిర్వహించిన ఓ యువ వ్యాపారికి నిన్న రూ.లక్ష రూపాయల రివార్డ్ వచ్చింది. నిజామాబాద్ నగరానికి చెందిన నాగమల్ల సంపత్ కి ఖలీల్ వాడి ప్రాంతం లో సౌమ్య కిరాణ అండ్ జనరల్ స్టొర్ ఉంది. తన దుకాణానికి సంబందించిన లావాదేవిల కోసం 7 నెలల క్రితం గూగూప్ పే బిజినెస్ యాప్ ని వాడుతున్నాడు. ఈ అకౌంట్ ద్వారా లావాదేవిలి నిర్వహిస్తున్నాడు. కస్టమర్లు సైతం ఇదె నంబరుకి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు. ఈ బిజినేస్ అకౌంట్ వాడుతున్న వారికి వారానికి ఒక రోజు బిజినెస్ స్క్రాచ్ కార్డు వస్తుంది. ఓపెన్ చేసి చూడ గా రూ. లక్ష రివార్డ్ గా వచ్చాయి. ఎప్పుడు రూ. 20-30 వచ్చేవని ఈ సారి లక్ష రూపాయలు రావటం ఆనందంగా ఉందని అంటూన్నాడు సంపత్. తాను మొదట నమ్మలేదని అయితే అకౌంట్ చెక్ చేయగా ఖాతాలో డబ్బు జమ అయిందని తెలిపాడు.

Related posts