telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

” రైతుబంధు” ను కేంద్రం అభినందించింది: సీఎంఓ

Kcr telangana cm

రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని కేంద్రం అభినందించిందని తెలంగాణ సీఎంఓ ఓక ప్రకటనలో తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వివిధ రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తరఫున వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. తమ కార్యక్రమాలను కేంద్రమంత్రి సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారని పేర్కొంది.

తెలంగాణలో మరెన్నో విజయవంతంగా అమలు చేస్తున్నారంటూ తమను ప్రశంసించారని వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్రం తరఫున కేంద్రానికి పలు సూచనలు చేశారు. వ్యవసాయ రుణాలపై వడ్డీభారం లేకుండా చేయాలని తెలిపారు.

Related posts