telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదు: చంద్రబాబు

chandrababu

ఏపీలో వరద బాధితుల ఇబ్బందుల పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. వరద ముంపు బాధితులను ఆదుకునే చర్యల్లో పాల్గొనాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. పార్టీ శ్రేణులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరదను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందని నేతలు అభిప్రాయపడ్డారు.

అయితే రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదని చంద్రబాబు వారించారు. వరద బాధితులను వీలైనంత మేరకు ఆదుకోవాలని సూచించారు. లంక గ్రామాల ప్రజలు, రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరవేయడంపై గుంటూరు రేంజ్ ఐజీకి ఫిర్యాదు చేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు.

Related posts