దేశంలోకి కరోనా విస్తరించకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని చర్యలను తీసుకుంటున్నాయి. అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. మరోవైపు, విదేశాల నుంచి వస్తున్న వారి నుంచే ఈ మహమ్మారి మన దేశంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విదేశాల నుంచి వచ్చే విమానాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించనుంది. ఆదివారం నుంచి విదేశాల నుంచి మన దేశంలోకి ఒక్క విమానాన్ని కూడా అనుమతించబోరు. మరోవైపు ప్రధాని మోదీ నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, 10 ఏళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారు ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు.
చైనాకు తగిన శాస్తి జరగాలి: మధ్యప్రదేశ్ సీఎం