telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ సీడ్స్ విత్తనాలు తెలంగాణలో పంపిణీ: మాజీ మంత్రి ఆలపాటి

Alapati Raja tdp

ఏపీ సీడ్స్ విత్తనాలు తెలంగాణలో పంపిణీ చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో రైతులకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, నీరు కూడా ఇవ్వలేదని, రుణమాఫీ చివరి రెండు విడతలు ఎందుకు ఇవ్వరంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు రుణమాఫీ ప్రకటించారని తెలిపారు.

జగన్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయటంపైనే దృష్టి సారించిందని విమర్శించారు. గత ప్రభుత్వ అవినీతిపై ఆధారాలు ఉంటే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ది గాలికి వదిలిపెట్టి టీడీపీపై కక్ష్య సాదింపే లక్ష్యంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.

Related posts