telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అందుకే టీడీపీని ప్రజలు ఇంటికి పంపించారు: మంత్రి బొత్స

minister bosta in vijayawada meeting

గత టీడీపీ పాలనపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. నిధులు ఉన్నప్పటికీ గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయిందన్నారు. అభివృద్ధి ఆలోచనే లేకుండా దోచుకోవడమే లక్ష్యంగా పని చేశారని విమర్శించారు. అందుకే టీడీపీని ప్రజలు ఇంటికి పంపించారని బొత్స ఎద్దేవా చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి నిధులే లేకుండా పోయాయని తెలిపారు. అయినప్పటికీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని అన్నారు. ఉగాదికి ఇళ్లు లేనివారికి ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. నిపుణుల కమిటీ సలహాలతో ఇళ్ల విషయంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

Related posts