తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తల్లీ కొడుకులపై కిరోసిన్పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. జిల్లాలోని నాగల్గిద్ద మండలం కారస్గుత్తిలో ఈరోజు తెల్లవారు జామున ఈ ఘాతుకం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుజాత (35), ఆమె కొడుకు (4)పై దుండగులు దాడిచేశారు. అనంతరం కిరోసిన్పోసి నిప్పంటించారు. మంటల్లో చిక్కుకున్న బాధితులు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.