telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

గుంటూరులో మైనర్ బాలికపై అత్యాచారం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికఠిన చట్టాలు తీసుకువచ్చినా.. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినప్పటికీ మహిళలపై దాడులు చేస్తున్నారు. తాజాగా… ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలోని తుఫాన్ నగర్ లో మైనర్ బాలిక పై అత్యాచారం చేశారు. గంజాయి మత్తులో బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారు కొందరు దుండగులు. అత్యాచారం చేసిన విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులు కూడా దిగారు దుండగులు. అయితే.. ఈ ఘటనపై బాలిక తరఫు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు పట్టాబిపురం పోలీసులు. స్థానిక పోలీసులతో ప్రయోజనం లేకపోవడంతో ఏకంగా జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసింది బాధితురాలి తల్లి. తుఫాన్ నగర్ లో గంజాయి బ్యాచ్ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ గంజాయి బ్యాచ్ వల్ల తమకు ప్రాణహాని ఉందని పోలీసులను వేడుకుంది. అయితే.. దీనిపై జిల్లా ఎస్పీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related posts