ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ఎస్ నేత మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావును మవోలు దారుణంగా హత్య చేశారు. భద్రాద్రి జిల్లాలో ఈ నెల 8న శ్రీనివాసరావును మావోలు కిడ్నాప్ చేశారు. ఇన్ఫార్మర్గా వ్యవహరించినందునే శ్రీనివాసరావును చంపామని మావోయిస్టులు చెబుతున్నారు. ఎర్రంపాడు, పొట్టిపాడు గ్రామాల మధ్య శ్రీనివాసరావు మృతదేహం దొరికింది.
మృతదేహం వద్ద చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరుతో లేఖ దొరికింది. ఆదివాసీ ప్రజాసంఘాల పేరుతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు.ఈ హత్యతో పరిసర గ్రామాల్లో భయానక పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కూడా ప్రతికార దాడికి పాల్పడుతారనే అనుమానంతో ఏజన్సీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.