telugu navyamedia
Uncategorized క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యాయత్నం!

తోటి విద్యార్థులు వేధిస్తున్నారంటూ ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ శివారు సరూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కర్మాన్‌ఘాట్‌లోని నియో రాయల్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఇద్దరు తోటి విద్యార్థులు డబ్బులు తేవాలంటూ తనను కొట్టి వేధిస్తున్నారని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి, కొక్కేనికి చీరతో ఉరేసుకుని శ్రీనివాస్ రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

గది తలుపులు మూసి ఉన్న విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు వాటిని తెరిచే ప్రయత్నం చేయడంతో లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో కిటికీ నుంచి చూసిన తల్లిదండ్రులు.. తలుపులు బద్దలు కొట్టి విద్యార్థిని హుటాహుటిన గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. విద్యాతికి ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts