telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీకి పెరుగుతున్న ఆధరణను చూసి టీఆర్ఎస్ భయపడుతుంది: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆధరణను చూసి టీఆర్ఎస్ భయపడుతోందని ఆ పార్టీ  అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ 30 లక్షల సభ్యత్వం కలిగి ఉందన్నారు. 11కోట్ల ప్రాథమిక సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచిందని పేర్కొన్నారు.

పార్టీ సిద్ధాంతాలు నచ్చి ప్రజలు బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ సభ్యత్వాలపై టీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. బీమా ఆశగా చూపి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను నమోదు చేస్తోందన్నారు. ములుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు పడిన ఓట్లు 62 వేలు అయితే.. 72వేల సభ్యత్వాలు చేసినట్లు అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. జై తెలంగాణ అన్న వారిని అణిచివేసి, నై తెలంగాణ అన్న వారికి పెద్దపీఠ వేస్తున్నారని విమర్శించారు.

Related posts