telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అమితాబ్‌ కు వ్యతిరేకంగా ఢిల్లీ కోర్టులో పిటీషన్…

ఢిల్లీ కోర్టులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ కు వ్యతిరేకంగా ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. అమితాబ్‌ను తొలగించాలంటూ అతడు కోర్టును కోరాడు. అసలు విషయం ఏంటంటే.. మనం ఎవరికి ఫోన్ చేసినా టెలికాం సంస్థ వారు కరోనా గురించి హెచ్చరిస్తూ ఓ కాలర్ ట్యూన్ వినిపించేలా సిద్దం చేశారు. దీనిని హిందీలో బిగ్‌బీ అమితాబ్ చెప్పారు. అయితే అతడి వాయిస్‌ను తొలగించాలని ఓ వ్యక్తి కోర్టులో పిటీషన్ వేశాడు. అయితే ఈ కాలర్ ట్యూన్ చెప్పడానికి కూడా అమితాబ్ పారితోషికం తీసుకున్నాడని ఆ వ్యక్తి తన పిటీషన్‌లో పేర్కొన్నాడు. అలా ఇటువంటి చిన్నపాటి దేశ సేవకు కూడా డబ్బు ఆశించేవారి స్వరం తీసుకోవాల్సిన అవసరం లేదని, కావాలంటే ఎందరో గొప్పగొప్పవారు తమ స్వరాన్ని ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నాడు. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిందని అలాంటి వారికి ప్రజలకు జాగ్రత్తలు చెప్పే అధికారం లేదని అతడు అన్నాడు. ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అందులో భాగంగా తన బాధ్యతను నిర్వర్తించడానికి కూడా డబ్బులు కోరేవారి నుంచి ఎటువంటి సహాయం అవసరం లేదని పిటిషన్ దాఖలు చేశాడు. చూడాలి మరి దీని పై కోర్ట్ ఏం చేస్తుంది అనేది.

Related posts