telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పది లక్షల మందితో హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తాం

R.Krishnaiah bc

బిసి ఉద్యమం చివరి దశకు చేరుకుందని… రాజ్యాధికారంలో తమ వాటా తమకు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు బిసిలకు ముఖ్యమంత్రి పదవి ఏ పార్టీ ఇవ్వలేదని… అడిగితే వచ్చేది బిచ్చం… పోరాడితే వచ్చేది అధికారమని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో అగ్గి మండుతుందని.. రాజ్యాధికారం వచ్చేదాకా ఏ పార్టీని.. ఏ ప్రభుత్వాన్ని వదిలి పెట్టమని హెచ్చరించారు. బిసిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని హెచ్చరిస్తున్నానని.. 2500 కులాలు ఇప్పటి వరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదని స్పష్టం చేశారు. 74 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో 14 శాతం బిసిలకు ప్రాతినిధ్యం దాటలేదని… దేశంలో తిరుగుబాటు వస్తుంది… రాజ్యాధికారం కోసం అగ్గి మండిస్తామని హెచ్చరించారు. త్వరలో రాజకీయ పార్టీల ఆఫీసులపై దాడులు చేస్తామని.. పది లక్షల మందితో హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం కంటే బిసి ఉద్యమం ఉదృతం చేస్తామని స్ఫష్టం చేశారు.

Related posts