telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ శారదా పీఠంలో జగన్ పూజలు

machilipatnam as ntr district by jagan

విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శ్రీ శారదా పీఠానికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులను జగన్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారి పూజలో పాల్గొన్నారు. గోమాతకు నైవేద్యం సమర్పించి జమ్మిచెట్టూ ప్రదక్షిణ చేస్తారు.

అనంతరం యాగశాలలో గత ఐదు రోజులుగా జరుగుతున్న శ్రీనివాసం చతుర్వేద హవనం, విశ్వశాంతి హోమాలను సందర్శిస్తారు. అనంతర మహాపూర్ణాహుతిలో పాల్గొంటారు. ఆ తర్వాత పీఠంలో కొత్తగా నిర్మించిన స్వయంజ్యోతి మంటపాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి జగన్ చేతుల మీదుగా స్వర్ణకంకణ ధారణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Related posts