telugu navyamedia
రాజకీయ వార్తలు

అప్పడంతో కరోనాను జయించవచ్చు: కేంద్ర మంత్రి

Arjun Ram Meghwal Papad Corona

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విషయంలో ఎవరూ ఎలాంటి తప్పుడు సమాచారం వ్యాపింపచేయరాదని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఓ కేంద్ర మంత్రి ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. అప్పడం తింటే కరోనాను జయించవచ్చని కేంద్ర జలవనరులు మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అంటున్నారు.

‘భాభీజీ పాపడ్’ (వదిన గారి అప్పడం) అనే బ్రాండెడ్ అప్పడం అయితేనే కరోనాతో సమర్థంగా పోరాడుతుందని సెలవిచ్చారు. ఈ అప్పడం తింటే ఒంట్లో కావాల్సినన్ని యాంటీబాడీలు తయారవుతాయని, దాంతో కరోనాపై కత్తిదూయవచ్చని వివరించారు. ఈ ‘భాభీజీ అప్పడం’ గురించి ప్రత్యేకంగా చెబుతూ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వదిలారు.
అయితే దీనిపై రకరకాల కామెంట్లతో నెటిజన్లు ఆడుకున్నారు. జోకులు భారీ స్థాయిలో విమర్శలు వెల్లువిరుస్తున్నాయి.

Related posts