telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కార్యాలయం ఖాళీ చేయాల్సిందే.. హెరాల్డ్ పత్రికకు హైకోర్టు ఆదేశం !

highcourt ordered to national herald

ఢిల్లీ హైకోర్టులో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కార్యాలయం ఖాళీ చేసే అంశంపై చుక్కెదురైంది. కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిందేనని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని కాంగ్రెస్‌ సారధ్యంలోని నేషనల్‌ హెరాల్డ్‌ దినపత్రిక 56 ఏళ్ల లీజుకు తీసుకుంది. అయితే లీజు రద్దుచేస్తూ ఈ భవనాన్ని ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు 30న ఆదేశాలు జారీచేసింది.

దీనితో నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన కోర్టు కేంద్రం ఆదేశాలపై స్టే విధించింది. దీనిపై కేంద్రం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయగా పరిశీలించిన కోర్టు స్టే విధిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది.

Related posts