telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సెక్రటేరియట్ ప్రాంతంలో మందిరం, మసీదు నిర్మిస్తాం: కేసీఆర్

KCR cm telangana

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయ ప్రాంతంలోని దేవాలయం, మసీదులకు కూడా ఇబ్బంది కలిగింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సెక్రటేరియట్ ప్రాంతంలో ఇప్పుడున్న ప్రాంతంలోనే ప్రభుత్వ నిధులతో పెద్ద దేవాలయం, మసీదులను నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది.

సెక్రటేరియట్ భవనాలను కూల్చేస్తున్న సందర్భంగా పెచ్చులు, శిథిలాలు పక్కనున్న దేవాలయం, మసీదులపై పడ్డాయి. దీంతో, వాటికి కొంచెం డ్యామేజీ అయింది. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ ఇలా జరగడం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. పాత భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ప్రార్థనా స్థలాలను చెడగొట్టడం కాదని తెలిపారు. ఎన్ని కోట్లు ఖర్చయినా వీటిని పునర్నిర్మిస్తామని చెప్పారు.

Related posts