telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

మోదీ చెప్పినట్లు జనతా కర్ఫ్యూ పాటించాలి: పవన్ కల్యాణ్

pawan-kalyan

ఈ నెల 22న మోదీ చెప్పినట్లు జనతా కర్ఫ్యూ పాటించాలని అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనాపై ప్రధాని మోదీ చేసిన సూచనలను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని జనసేన ఓ ప్రకటన విడుదల చేశారు. వాటిని ప్రజలందరూ పాటించాలని ఆయన కోరారు.

కరోనా మహమ్మారి ప్రమాదకరమని తెలిసినప్పటికీ సేవలు అందిస్తోన్న వైద్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కృషి చేద్దామని పవన్ పిలుపునిచ్చారు.

Related posts