telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అమ్మసముద్రంపేటలో రెండు ఇంద్రధనస్సులు…

నెల్లూరు జిల్లా అమ్మసముద్రంపేట, రహ్మతాబాద్ లో అద్భుత దృశ్యం కనిపించింది. ఇక్కడి దర్గా ప్రాంగణ ప్రాంత గగనతలంలో ఇంద్రధనస్సు దర్శనమిచ్చింది. అయితే, దర్గా పైభాగాన తాకుతున్నట్టుగా ఇంద్రధనస్సు కనిపించింది. ఏడు రంగులతో, అత్యంత కాంతివంతంగా ఈ రెయిన్ బో ఉంది.

ఒకటిగా కాకుండా, రెండు వలయాలుగా ఏర్పడిన ఈ ఇంద్రధనస్సును చూసి..దర్గాకు వచ్చిన భక్తులు, స్థానికులు ఆశ్చర్యచకితులయ్యారు. దీన్ని దైవ మహిమగా భావించి..భక్తులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Related posts