telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కర్ణాటక వెళ్లాలని.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చోరీ

New couples attack SR Nagar

లాక్‌డౌన్ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన కర్ణాటక వ్యక్తి స్వస్థలానికి వెళ్లేందుకు మరోమార్గం లేక ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు. అయితే కొత్త వ్యక్తి వ్యక్తి డ్రైవర్ సీట్లో ఉండడంతో అనుమానించిన ఓ డ్రైవర్ వెంబడింపట్టుకోవడంతో ఆ దొంగ ప్లాన్ బెడిసికొట్టింది. కర్ణాటకకు చెందిన పూజా బిల్లీఖాన్ బెంగళూరు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడవకపోవడంతో ఏకంగా బస్సునే దొంగిలించి అందులోనే దర్జాగా స్వగ్రామం చేరుకోవాలని భావించాడు.

అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ బస్సు డిపోలోకి వెళ్లాడు. అదను చూసి ఓ బస్సు తీసుకుని బయలుదేరాడు. ఓ డ్రైవర్ బైక్‌పై అతడిని వెంబడించాడు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న పెనుకొండ మండలం అమ్మవారిపల్లి వద్ద ఉన్న ఇండస్ట్రియల్ పోలీసులు రంగంలోకి దిగి దొంగను అదుపులోకి తీసుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు

Related posts