టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ నేతలపై మండిపడ్డారు. పల్నాడు వైసీపీ బాధితుల కోసంటీడీపీ ఇటీవలే గుంటూరులో పునరావాసం శిబిరం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా వైసీపీ పిడుగురాళ్లలో పోటీ శిబిరాన్ని ఏర్పాటు చేసిందంటూ చంద్రబాబు నిప్పులుచెరిగారు. గుంటూరులో మేం శిబిరం ఏర్పాటు చేశామని మీరు పిడుగురాళ్లలో కౌంటర్ శిబిరం ఏర్పాటు చేస్తారా? అంటూ నిలదీశారు.
గత ఇదేళ్ళ ఏళ్ల క్రితం బాధితులకు ఇప్పుడు శిబిరం పెట్టడం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో నన్ను సవాల్ చేయడం ఏంటి? ఇది సవాళ్లు విసిరే సమయమా? లేక, బాధితులను ఆదుకునే సమయమా? అని అడుగుతున్నా” అంటూ ట్విట్టర్ లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.