వరద సహాయం భాదితులు ఆందోళన ఇవాళ దిగారు. సీఎం క్యాంప్ ఆఫీస్ సీమపంలోని మీసేవ వద్ద 10 రూపాయలు వరద సహాయం పొందని భాదితులు ఆందోళన నిర్వహించారు. అయితే.. క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళన కు వచ్చిన భాదితులను చెదరగొట్టారు పోలీసులు. లాక్ డౌన్ లో ఏ విధంగా అయితే పరిహారం ఇచ్చారో అదే విధంగా 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సెకెండ్ ఫ్లోర్ ఉన్న వారికి వరద సహాయం చేశారు కానీ.. నిజమైన భాదితులకు అన్యాయం చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారు జామున మూడు గంటలు నుండి మీసేవ వద్ద పడిగాపులు కాస్తున్నారు బాధితులు. జీహెచ్ఎంసీ కమిషనర్ స్టేట్మెంట్ కు నిరసనగా క్యాంపు ఆఫీస్ వద్ద నిరసన చేస్తున్నారు బాధితులు. కాగా.. వరద సాయం కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఇవాళ పేర్కొన్నారు. దీంతో ఈ బాధితులు ఆందోళనకు దిగారు.
previous post
మోదీని సంతృప్తి పరచడానికే ఎగ్జిట్ పోల్స్: విజయశాంతి