ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి వర్గ ఏర్పాటుపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ సమావేశానికి 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఉదయం 11గంటల తర్వాత మంత్రులెవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. తొలి జాబితాలో 17 మంది మంత్రుల పేర్లను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా సమతుల్యత పాటించి మంత్రుల జాబితాను జగన్ సిద్ధం చేసినట్లు సమాచారం. దాదాపు ఖరారైన మంత్రులంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా ఇదే:
ఆళ్ల రామకృష్ణ రెడ్డి
కొడాలి నాని
దాడిశెట్టి రాజా
పినిపే విశ్వరూప్
అవంతి శ్రీనివాస్
మేకపాటి గౌతమ్ రెడ్డి
బొత్స సత్యనారాయణ
పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
మేకతోటి సుచరిత
బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
అనంత వెంకట రామిరెడ్డి
అంజద్ బాషా
తెల్లం బాలరాజు
బాలినేని శ్రీనివాసరెడ్డి
ముడునూరి ప్రసాద రాజు
పిల్లి సుభాష్ చంద్ర బోస్
అనిల్ కుమార్ యాదవ్