టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి పండగకు నారావారిపల్లెకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రతి సంక్రాంతిని స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకునే నారా కుటుంబ సభ్యులు ఈ ఏడాది మాత్ర వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అమరావతిలో రైతులు ఆందోళనలు చేపడుతున్న తరుణంలో తాను సంక్రాంతి జరుపుకోవడం సబబు కాదని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సంక్రాంతి వేడుకలకు సొంతూరు వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోనే ఉండి రైతులకు సంఘీభావం ప్రకటించాలని బాబు నిర్ణయించారు. ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో నారావారిపల్లెలో నందమూరి, నారా కుటుంబసభ్యులు సందడి చేస్తుంటారు.