ఏపీ సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సీఐడీ నోటీసులు ఇవ్వడంపై సీఎం జగన్పై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరని జగన్కు చురకలు అంటించారు లోకేష్. జగన్ ఎన్ని కుట్రలు చేసినా… భయపడేదే లేదని ఫైర్ అయ్యారు. “తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి సీఎం జగన్ పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు? 21నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సి,ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు.సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు. అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది. ” నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
previous post
next post