telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తిరుపతిలో ఒమిక్రాన్ ప్రకంపనలు..

చిత్తూరుజిల్లాలో ఒమిక్రాన్ ప్రకంపనలు సృష్టించింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో తొలి కేసు నమోదైనట్లు ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు సమాచారం. యూకేనుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. తిరుపతి పెద్దకాపు లేఅవుట్ కు చెందిన 34 సంవత్సరాల సంవత్సరాల వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ నిర్థరణకావడంతో అక్కడి పరిసరవాసులు ఆందోళనకు గురయ్యారు. ఆ వ్యక్తి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

First Omicron case reported in AP - The Hindu

అయితే ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టడంతో తిరుపతిలో టెస్టుచేసుకోవడంతో పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఇది ఒమిక్రాన్ వచ్చి ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వైద్యాధికారులు ఈవిషయంపట్ల స్పందించారు. యూకేనుంచి వచ్చిన వ్యక్తిని పరీక్షిస్తే… కోవిడ్ నిర్థరణ కావడంతో నమూనాలు సేకరించి జీనోమ్ టెస్ట్ కు పంపినట్లు వైద్యాధికారులు తెలిపారు. పరీక్ష ఫలితాలు వస్తేగానీ, ఒమిక్రాన్ అనే నిర్ధారణకు రాలేమని చిత్తూరు జిల్లా వైద్యాధికారి శ్రీహరి తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు జరుపుతున్నామని తెలిపారు.

Related posts