telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

స్వచ్ఛమైన నీరు లేనిదే ప్రపంచం లేదు: గవర్నర్ తమిళిసై

Tamilisai Soundararajan governor

నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ -2019 సదస్సును గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛమైన నీరు లేనిదే ప్రపంచం లేదన్నారు.

రాజ్‌భవన్‌లో ప్లాస్టిక్ నిషేధం వినియోగించడంతో పాటు సోలార్ వినియోగం పెంచుతామని తెలిపారు. మట్టి పాత్రలను వినియోగిస్తామని చెప్పారు. పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ తమిళిసై అభినందించారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఈ సదస్సు నాలుగు రోజుల పాటు జరగనుంది.

Related posts