telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

cm jagan ycp

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేబినెట్ విస్తరణ, కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై చర్చించనున్నారు.

ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న సీపీఎస్ (కాంపన్సేటరీ పెన్షన్ స్కీమ్), అలాగే సంక్షేమ పథకాలు, ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపైనా మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులకు ఆమోదం తెలిపే అవకాశముంది. రాయలసీమ కరువు నివారణ కు ప్రాజెక్టుల నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

Related posts