telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత జనాభా .. 128.85 కోట్లు.. లెక్కలు వచ్చేశాయి..

indian population is 128.85crores

తాజా జాతీయ జనాభా లెక్కల గణాంకాల ప్రకారం దేశ జనాభా 128.85 కోట్లు అని తేల్చింది. ఇదే సమయంలో నిమిషానికి 49 మంది జన్మిస్తుంటే, 15 మంది మరణిస్తున్నారు. 2017 గణాంకాలు విడుదల కాగా, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ జనాభా 1.45 కోట్లు పెరిగింది.

తెలంగాణలో 3.69 కోట్ల మంది ఉండగా, జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 5.23 కోట్ల మంది ఉండగా, 10వ స్థానంలో ఉంది. అత్యల్పంగా సిక్కిం 6.56 లక్షల జనాభాతో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇక ఎప్పటిలానే ఉత్తరప్రదేశ్ జనాభా విషయంలో టాప్ లో నిలిచింది. ఈ రాష్ట్రంలో 22.26 కోట్ల మంది ఉన్నారు.

Related posts