తాగిన మైకంలో అభంశుభం తెలియని కన్న బిడ్డను బస్సుకిందకు విసిరేసింది ఓ తల్లి.. డ్రైవర్ అప్రమత్తతతో స్వల్ప గాయాలతో చిన్నారి బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీలో ఫుట్ పాత్ పై ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకుని జీవిస్తున్న బాలు, సోనీలకు రెండేళ్ల పాప జ్యోతి ఉంది. రోజూ భార్య, భర్త తాగి వచ్చి, ఫుట్ పాత్ పై ఉన్న ఖాళీ స్థలాల్లో నిద్రిస్తుంటారు.
ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా, దీంతో నిన్న తప్పతాగిన మత్తులో తన బిడ్డను సోనీ, ఓ బస్సు కిందకు విసిరేసింది. అయితే, ఆమెను గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేయడంతో, పాపకు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. అప్పటికీ శాంతించని సోనీ, తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని బస్సు ముందు నేలపై కొట్టింది. ఈ మొత్తం ఘటనను గమనిస్తున్న స్థానికులు, అడ్డుకుని, సదరు మహిళను చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తల్లీబిడ్డలను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తండ్రి వైఖరికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు: గల్లా జయదేవ్